భద్రాచలం: భద్రాచలం అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన విశ్రాంత ఉద్యోగి కోదండరామయ్య అనారోగ్యంతో మృతి చెందారు. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో లాబ్ టెక్నిషియన్గా పనిచేస్తూ మెడికల్ ఎంప్లాయిస్ కార్పొరేషన్ సొసైటీసెక్రటరీగా, భద్రాచలం రెడ్క్రాస్ సోసైటీ సెక్రటరీగా, 15ఏళ్లు రోటరీ సభ్యునిగా, ఆఫీసర్స్ క్లబ్ కోశాధికారిగా సేవలు అందించారు. గోదావరి కరకట్ట వద్ద దాతల సహకారంతో వైకుంఠ ధామాన్ని నిర్మించారు. బ్రిడ్జి సెంటర్లో అభయాంజనేయ స్వామి వారి టెంపుల్, విఘ్నేశ్వర ఆలయాన్ని కూడా నిర్మించారు. కోదండరామయ్య మృతిపట్ల పలువురు ప్రముఖులు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు.