ఖమ్మం : సిమెంట్ కిటికి మీద పడి బాలుడు మృతిచెందిన విషాద సంఘటన జిల్లా లోని పెనుబల్లిలో చోటు చేసుకంది. స్థానికుల కథనం మేరకు..కల్లూరు మండలం రఘునాథ బంజరు గ్రామానికి చెందిన కుక్కా మాధవరావు, రజని దంపతులు కూలి పని నిమిత్తం పెనుబల్లిలో సిమెంటు వరలు తయారుచేసే ఫ్యాక్టరీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు.
ఈ క్రమంలో కుమారుడు ఈశ్వర్ (5)ను వెంట పెట్టుకుని పనికి వెళ్లారు. ఆడుకుంటున్న సమయంలో సిమెంటు కిటికి అతడి మీదపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పెనుబల్లి వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ బాలుడు మృతిచెందాడు. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ తమ కళ్లముందు తిరిగిన కొడుకు ఒక్కసారిగా తమ ముందే మృతిచెందడంతో వారి రోదనలు మిన్నంటాయి.
ఇవి కూడా చదవండి..
బహుజన తత్వవేత్త జ్యోతిరావు పూలే : మంత్రి పువ్వాడ
‘మల్లన్న’ క్షేత్రంలో భక్తుల కోలాహాలం
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పూలే : మంత్రి ఐకే రెడ్డి
గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతి రావు ఫూలే