సంగారెడ్డి : నారాయణఖేడ్లోని తహసీల్దార్ ఆఫీస్ ముందు శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. మారుతి కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
నారాయణఖేడ్కు చెందిన ఓ వ్యక్తి మారుతి 800 కారులో వెళ్తున్నాడు. అయితే ఇంజిన్లో నుంచి దట్టమైన పొగలు వచ్చాయి. క్షణాల్లోనే మంటలు కూడా ఎగిసిపడ్డాయి. అప్రమత్తమైన డ్రైవర్ కారును ఆపి.. డోర్ తీసి బయటకు వచ్చాడు. స్థానికులు అందించిన సమాచారంతో.. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసింది. డ్రైవర్ ప్రాణాలతో బయటపడడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.