రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చందుర్తి మండలంలోని నర్సింగాపూర్ గ్రామ శివారులో వేగంగా వెళ్తున్న కారు ఇంజిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ కారును ఆపేసి దిగిపోయాడు. అనంతరం పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాడు. ఘటనాస్థలికి అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.