యాదాద్రి : జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలం ధర్మోజీగూడెం వద్ద జాతీయ రహదారిపై ఇనుప లోడ్తో వెళ్తున్న లారీ హైవే పల్టీ కొట్టింది. చీకట్లో లారీని వరుసగా మూడు కార్లు ఢీకొట్టాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హైదరాబాద్కు తరలించారు. జాతీయ రహదారిపై నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ను పునరుద్ధరిస్తున్నారు.