కొచ్చి : సహజీవనం చేస్తున్న మహిళనే ఫ్లాట్ లో నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసి లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి ఉదంతం కొచ్చిలోని మెరైన్ డ్రైవ్ లో వెలుగుచూసింది. ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేసే మహిళను ఫిబ్రవరి 20 నుంచి మార్చి 8 మధ్య ఫ్లాట్ లోనే బంధించిన నిందితుడు మార్టిన్ జోసెఫ్ ఆమెకు నరకం చూపాడు. త్రిసూర్ జిల్లాలోని పుటెక్కరకు చెందిన నిందితుడు జోసెఫ్ వ్యాపారం చేస్తుంటాడు.
బాధితురాలిని బంధించిన జోసెఫ్ ఆమెపై కారంపొడి చల్లిన వేడినీళ్లను పోసి హింసించే వాడు. చిత్రహింసలకు గురిచేస్తూ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి నుంచి రూ ఐదు లక్షలు పెట్టుబడి పెట్టించిన జోసెఫ్ ఆ డబ్బులు అడగడంతో ఈ నీచానికి ఒడిగట్టాడు. మహిళ నగ్న చిత్రాలను తీసిన నిందితుడు వాటిని ఆమె తల్లితండ్రులకు పంపుతానని బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదుతో జోసెఫ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు నిందితుడిని న్యాయస్దానం ఎదుట హాజరుపరిచారు.