అమరావతి, జూలై :చిత్తూరు జిల్లాలో నకిలీ పోలీస్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులుగా చెలామణీ అవుతూ డబ్బులు కాజేస్తున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. చెన్నైకి చెందిన ఓ వ్యక్తిని బెదిరించి అతని దగ్గర 45 లక్షలు కాజేశారు. ఇదే తరహాలో దేశంలో పలు చోట్ల మోసాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు . ముఠాలో తొమ్మిది మందిని అరెస్ట్ చేయగా ,ప్రధాన నిందితుడు షేక్ అబ్దుల్లా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.