మంచిర్యాల : పెళ్లి కుమారుడు, అతని కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగాయి. ఈ ఘటన మందమర్రి మండలం అందుగులపేట గ్రామ సమీపంలో గురువారం రాత్రి చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
మందమర్రి సబ్ ఇన్స్పెక్టర్ చంద్రకుమార్ కథనం ప్రకారం.. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణానికి చెందిన జాడి రాజేశ్(పెళ్లి కుమారుడు) కు మండల్ కుంసుం(హైదరాబాద్) తో వివాహ నిశ్చయించారు. వీరి వివాహ ముహుర్త సమయం శుక్రవారం ఉదయం ఉండటంతో.. గురువారం రాత్రి పెళ్లి కుమారుడు జాడి రాజేశ్ తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్కు బయల్దేరాడు.
అందుగులపేట గ్రామ సమీపంలోకి రాగానే కారు ఇంజిన్లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమై రాజేశ్ ఈ ఘటన నుంచి తనతో పాటు కుటుంబ సభ్యులను కాపాడుకోగలిగాడు. పెళ్లికి సంబంధించిన వస్తువులన్నీ పూర్తిగా కాలిపోయాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.