ముంబై : నగరాల్లో అన్ని వసతులతో అందుబాటు రెంట్లో ఇల్లు లేదా ఫ్లాట్ను వెతికిపట్టుకోవడం సామాన్యమైన విషయం కాదు. దీనికోసం బడ్జెట్ లెక్కలతో పాటు ఎంతోమందిని సంప్రదించి ఇండ్ల వేట చేపట్సాల్సి ఉంటుంది. సరైన ఇంటి కోసం అన్వేషణ సాగించిన పుణేకు చెందిన ఇంజనీర్ను ఫ్లాట్ యజమానిగా నమ్మించిన ఓ స్కామర్ (Cyber Fraud) ఏకంగా రూ. 3 లక్షలు బురిడీ కొట్టించాడు. శ్యామ్లాల్ హన్స్దా అనే ఇంజనీర్ పుణేలోని బలేవాడిలో ఫ్లాట్ను రెంట్ తీసుకునేందుకు ఆన్లైన్లో సెర్చి చేశాడు.
ప్రముఖ హౌసింగ్ సొసైటీలో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ రెంట్కు ఉందనే ప్రకటన కనిపించింది. ప్రాపర్ట వెబ్సైట్లో ఫ్లాట్ ఇమేజ్లను చూడటంతో పాటు రెంట్ కూడా తన బడ్జెట్కు తగినవిధంగా ఉండటంతో యాడ్ను క్లిక్ చేశాడు. కొద్దిరోజుల తర్వాత వాట్సాప్లో ప్రాపర్టీ యజమానిని తానేనంటూ శ్యామ్లాల్కు మెసేజ్ వచ్చింది. రూ. 2500 టోకెన్ అమౌంట్ చెల్లించిన తర్వాత ఫ్లాట్ను చూడాలని నమ్మబలికాడు. టోకెన్ అమౌంట్ చెల్లిస్తే హౌసింగ్ సొసైటీ విజిటింగ్ పాస్ను జారీ చేస్తుందని చెప్పుకొచ్చాడు.
మొదటి నెల రెంట్ నుంచి ఈ టోకెన్ అమౌంట్ను తగ్గించుకోవచ్చని చెప్పాడు. దీంతో స్కామర్ను నమ్మిన శ్యామ్లాల్ రూ. 2500 చెల్లించాడు. ఆపై సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో మరింత మొత్తం చెల్లించాలని డిమాండ్ చేశాడు. ఇలా స్కామర్ పలు కారణాలతో బాధితుడి నుంచి పలుమార్లు మొత్తం రూ. 3.6 లక్షలు వసూలు చేశాడు. వారం రోజుల తర్వాత బాధితుడు తాను చెల్లించిన మొత్తం వెనక్కి ఇవ్వాలని స్కామర్కు ఫోన్ చేయగా అతడి ఫోన్ నెంబర్ పనిచేయకపోవడంతో మోసపోయానని గ్రహించాడు. పెద్దమొత్తంలో డబ్బు పోగొట్టుకున్న బాధితుడు సైబర్ పోలీసులను ఆశ్రయించి నిందితుడిపై కేసు నమోదు చేశారు.
Read More :
Visa Services | కెనడాలో వీసా సేవలను నిలిపివేసిన భారత్