రాజన్న సిరిసిల్ల : కరోనా కాటుకు ఎంఈవో బలయ్యాడు. జిల్లాలోని కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన రాజయ్య (50) కరోనా బారిన పడి హైదరాబాద్లోని ఓ దవాఖానలో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు. 2005 సంవత్సరంలో ఎల్లారెడ్డిపేట ఎంఈవోగా నియమితులయ్యారు.
నాటి నుంచి ఇక్కడే సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. ఈ నెల 23న పాఠశాలల తనిఖీకి వెళ్లిన ఆయన ముస్తాబాద్ మండలంలోని కొండాపూర్లో కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్గా తేలింది. దీంతో ఇంటివద్దే చికిత్స తీసుకున్న ఆయన సోమవారం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేరాడు. పరిస్థితి విషమించి బుధవారం మరణించాడు.
ఇవి కూడా చదవండి..
మహబూబాబాద్ జిల్లాలో వడగండ్ల వాన
ప్రాణం పోసిన దవాఖానలో.. మొక్కను నాటిన మహిళ
ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు చేయండి
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్
సీనియర్ జర్నలిస్టు శ్రీధర్ మృతిపట్ల మంత్రి వేముల సంతాపం
కొనుగోలు కేంద్రాలతోనే రైతులకు మేలు