శంషాబాద్ : మద్యం మత్తులో కారు నడిపి శంషాబాద్ ఎయిర్పోర్టులో మంగళవారం ఓ మందుబాబు వీరంగం సృష్టించాడు. డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ హోం గార్డు ను ఢీ కొట్టాడు. శంషాబాద్ ఆర్జీఐఏ సీఐ విజయ్ కుమార్ వివరాల ప్రకారం…. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాక సందర్భంగా పోలీసులు ఎయిర్పోర్టులో రిహార్సల్స్ చేపట్టారు.
ఈ క్రమంలో ఎయిర్పోర్టు రోటరీ-2 వద్ద పక్కనే ట్రాఫిక్ హోంగార్డు అశోక్ విధులు నిర్వహిస్తున్నాడు. ఇదే సమయంలో ఓ ఇన్నోవా కారులో వచ్చిన డ్రైవర్ తాజుద్దీన్ హోం గార్డును ఢీ కొట్టాడు. దీంతో అశోక్కు గాయాలయ్యాయి. వెంటనే అశోక్ను నగరంలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.
ఈ ప్రమాద సమయంలో తాజుద్దీన్ ఫోన్ మాట్లాడుతూ అతివేగంలో అదుపుతప్పినట్లు గుర్తించారు. దీనికి తోడు మద్యం మత్తులో ఉన్నట్లు బ్రీతింగ్ ఎనలైజర్ టెస్టులో తేల్చారు. నిందితుడు తాజుద్దీన్ పరారైనట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.