హైదరాబాద్ : మేడ్చల్ జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి 140 కిలోల అల్ప్రాజోలంను స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్లోని జీడిమెట్ల పైప్లైన్ రోడ్డులో పోలీసులు ఉదయం వాహన తనిఖీలు చేపట్టారు. రెండు కార్లలో అల్ప్రాజోలం తరలిస్తున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కార్లతోపాటు రూ. 50 వేల నగదు, రెండు సెల్ఫోన్లను సీజ్ చేశారు. సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు బాలానగర్ డీసీపీ పద్మజ తెలిపారు.