అహ్మదాబాద్ : తన బాగోగులు చూసుకునేందుకు వచ్చిన బాలిక (16)పై లైంగిక దాడికి పాల్పడిన దివ్యాంగుడి (56)కి ప్రత్యేక న్యాయస్ధానం యావజ్జీవ ఖైదుతో పాటు రూ 3.7 లక్షల జరిమానా విధించింది. బాలిక కుటుంబాన్ని ఆర్ధికంగా ఆదుకుని వారి నమ్మకాన్ని చూరగొన్న నిందితుడు వారి పేదరికాన్ని ఆసరాగా చేసుకుని బాలికను పోషిస్తానని తన ఇంటికి తీసుకువచ్చాడు.
గువహటికి చెందిన బాలిక బిహార్కు చెందిన కుల్దీప్ సింగ్ రాధోఢ్ చికిత్స నిమిత్తం అతడి వెంట గత ఏడాది గుజరాత్లోని కచ్కు వచ్చింది. పోలియోతో బాధపడుతున్న రాధోడ్ రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో పరిస్ధితి మరింత క్షీణించింది. ఈ క్రమంలో తన బాగోగులు చూసేందుకు వచ్చిన బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై లైంగిక దాడి ఆరోపణలపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఇక విచారణలో ప్రత్యక పోక్సో న్యాయస్ధానం రాధోడ్ను దోషిగా నిర్ధారించి జీవిత ఖైదుతో పాటు రూ 3.7 లక్షల జరిమానా విధించింది.