శామీర్పేట, ఆగస్టు : అక్రమ నిర్మాణాలను చేపడితే కఠిన చర్యలు తప్పవని ఎన్ఫోర్స్మెంట్ టీం అధికారులు హెచ్చరించారు. నాగారం మున్సిపల్ పరిధిలో సోమవారం అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఎస్బీపాస్ ద్వారా అనుమతులు పొందిన తర్వాత మాత్రమే నిర్మాణాలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ సారిక ఆర్ అండ్ బీ అధికారులు, ఫైర్ సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.