న్యూఢిల్లీ : దేశ రాజధానిలో భారీ అంతర్జాతీయ డ్రగ్ రాకెట్ను ఢిల్లీ పోలీసులు చేధించారు. నిందితుల నుంచి రూ 13 కోట్ల విలువైన హెరాయిన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ముగ్గురు ఆఫ్రికన్లను అరెస్ట్ చేశారు. డ్రగ్ రాకెట్కు ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న స్టాన్లీ చిమెజ్ అలసోనె కూడా అరెస్టయిన వారిలో ఉన్నాడు.
మిగిలిన నిందితులను హెన్రీ ఒకోలి, పీటర్ ఇబనజుగా గుర్తించారు. నిందితులు ఉత్తం నగర్, మోహన్ గార్డెన్ ప్రాంతం నుంచి డ్రగ్ దందా నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. సరైన వీసాలు లేకుండానే నిందితులు నివసిస్తున్నారని దర్యాప్తులో తేలింది. భారత పోర్టుల ద్వారా నైజీరియా గుండా రష్యా నుంచి హెరాయిన్ను దేశంలోకి స్మగుల్ చేస్తున్నారని పోలీసులు గుర్తించారు.