న్యూఢిల్లీ : ఢిల్లీలో రూ. కోటిన్నర విలువైన కేజీ హెరాయిన్ను పోలీసులు సీజ్ చేసి ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. స్వరూప్ నగర్ ప్రాంతంలో ఓ వ్యక్తి అక్రమంగా హెరాయిన్ను తరలిస్తుండగా గుర్తించి పట్టుకున్నారు. పట్టుబడిన వ్యక్తి భాలస్వ ప్రాంతానికి చెందిన డ్రగ్ సప్లయర్ అరవింద్ కుమార్గా పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి మాదకద్రవ్యాల చట్టం కింద కేసు నమోదు చేశారు. జెతిన్ అనే వ్యక్తితో కలిసి చాందిని చౌక్ కేంద్రంగా అరవింద్ కుమార్ కొంతకాలంగా డ్రగ్స్ సరఫరా చేశాడు. ఆ తరువాత బరేలీకి చెందిన మరో సరఫరాదారుడితో చేతులు కలిపినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. ప్రతి పదిహేను రోజులకు ఒకసారి అరవింద్ బరేలీ వెళ్లి అక్కడి నుంచి హెరాయిన్ తీసుకువచ్చి స్వరూప్నగర్లోని వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు తెలిపారు.