న్యూఢిల్లీ : ఓ డ్రైవర్ మద్యం మత్తులో కారును అతి వేగంగా నడిపాడు. కారు అదుపుతప్పి ఓ ముగ్గురు పిల్లలపైకి దూసుకెళ్లింది. దీంతో చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఢిల్లీలోని గులాబీ బాగ్లో ఇవాళ ఉదయం చోటు చేసుకుంది.
ఢిల్లీలోని గులాబీ బాగ్లో ఓ 30 ఏండ్ల యువకుడు తన మారుతి బ్రీజా కారులో వేగంగా వెళ్తున్నాడు. అంతలోనే కారు అదుపుతప్పి ఫుట్పాత్పైకి దూసుకెళ్లింది. ఆ ఫుట్పాత్పై ఉన్న ముగ్గురు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కొంచెం దూరంలో కారును ఆపిన యువకుడిని స్థానికులు అదుపులోకి తీసుకున్నారు. కారు డ్రైవర్ను స్థానికులు చితకబాది, అనంతరం పోలీసులకు అప్పగించారు. గాయపడ్డ చిన్నారులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 10, 4 ఏండ్ల వయసున్న ఇద్దరు పిల్లలకు స్వల్ప గాయాలు కాగా, 6 ఏండ్ల వయసున్న మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.
కారు డ్రైవర్ను ప్రతాప్నగర్కు చెందిన గజేందర్గా పోలీసులు గుర్తించారు. అయితే అంతకు ముందు కూడా గజేందర్ వేగంగా కారు నడిపినట్లు స్థానికులు పేర్కొన్నారు. మెల్లగా నడపాలని హెచ్చరించినప్పటికీ అతను వినిపించుకోలేదన్నారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలిపారు.