బొంరాస్పేట : దవాఖానకు వెళ్లిన ఓ మహిళ తప్పిపోయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని మహాంతిపూర్ గ్రామానికి సమీపంలో ఈ నెల 10వ తేదిన ట్రాక్టర్ బోల్తాపడ్డ సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో అబ్నవోని వెంకటయ్యకు తీవ్రంగా గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వెంకటయ్యను హైదరాబాద్లోని ఉస్మానియా దవాఖానకు తరలించగా వెంట తల్లి లాలమ్మ(55) కూడా వెళ్లింది. ఈ నెల 13న దవాఖాన నుంచి బయటకు వెళ్లిన లాలమ్మ తిరిగి రాలేదు. దీంతో ఆమె పెద్ద కొడుకు లాలయ్య ఉస్మానియా దవాఖాన పరిధిలోని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆచూకీ తెలిసిన వారు 8186925713ను సంప్రదించాలన్నారు.