తలకొండపల్లి : ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం… తలకొండపల్లి మండలం చుక్కాపూర్ శివారులో తలకొండపల్లి షాద్నగర్ ప్రధాన రహదారిపై రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. తలకొండపల్లి మండలంలోని పాతకోటతండాకు చెందిన కిషన్నాయక్ ఆమనగల్లు వైపు వెలుతుండగా, జడ్చర్లకు చెందిన నరసింహ ఎదురుగా వస్తున్నాడు.
ఈ క్రమంలో రెండు వాహనాలు ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108 సమాచారం అందించడంతో ఇరువురిని ఆమనగల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.