షాబాద్ : గట్టు చప్పుడు కాకుండా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి వ్యక్తులను షాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. షాబాద్ సీఐ ఆశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అంతారం గేట్ శివారులోని భారత్ పెట్రోల్ పంప్ పక్కన గల శ్రీబాలాజీ మార్వాడి దాబాలో గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం తెలుసుకున్న పోలీసులు మార్వాడి దాబాలో తనిఖీలు చేశారు. అందులో సుమారు 1800 గ్రాముల గంజాయి లభించింది. దాబా నిర్వహకుడు పురుషోత్తంశర్మ తన స్నేహితుడైన సంజీవ్కుమార్ దగ్గర నుంచి గంజాయి తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నాడు. చట్ట వ్యతీరేకంగా గంజాయిని అమ్ముతున్నా వీరి ఇద్దరిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి నిందితులను చేవెళ్ల కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ తెలిపారు.