ఇబ్రహీంపట్నం రూరల్ : ఓ గుర్తు తెలియని మృతదేమం లభ్యమైన ఘటన శుక్రవారం ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు గ్రామ సమీపంలోని పెద్దవాగులో ముళ్ల కంపోలో చిక్కుకున్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై విజయ్కుమార్ తెలిపారు.