సంగారెడ్డి : తండ్రీ కొడుకుల మధ్య భూ తగాదా తండ్రి ప్రాణాలను బలితీసుకుంది. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని అందోల్ మండలం బ్రాహ్మణపల్లిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పాపయ్య (55) తమ భూమి విషయంలో మాటా మాటా పెరిగి గొడవకు దిగారు. కోపంతో తండ్రిపై కొడుకులు దాడి చేయడంతో పాపయ్య తీవ్రంగా గాయపడ్డాడు.
చికిత్స నిమిత్తం హాస్పిటల్లో చేర్పించగా చికిత్స పొందుతూ పాపయ్య మృతి చెందాడు. సమాచారం అందుకున్న జోగిపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పాపయ్య కొడుకులు పరారీలో ఉన్నారని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.