మరణించిన తండ్రి డెడ్బాడీని ఇంట్లోనే ఉంచి, దానితో సహజీవనం చేస్తున్నాడో కుమారుడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో వెలుగు చూసింది. ఇక్కడి కేపీ రాయ్ లేన్లో ఈ తండ్రీకొడుకులు నివసిస్తున్నారు. తండ్రి పేరు సంగ్రామ్ డే. ఆయన వయసు 70 ఏళ్లు. మూడు నెలల క్రితం ఆయన మరణించారు.
అయితే ఆ మృతదేహాన్ని అలాగే ఇంట్లో ఉంచుకున్న ఆయన కుమారుడు కౌషిక్ డే (40).. మూడు నెలలుగా అదే ఇంట్లో జీవిస్తున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కౌషిక్ మానసిక పరిస్థితి బాగలేదని పోలీసులు తెలిపారు. సంగ్రామ్ మరణానికి కారణం కనుక్కునేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.