హైదరాబాద్: అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టు రట్టయింది. ఈ ముఠా విషయం తెలుసుకున్న పోలీసులు నిందితులందర్నీ అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 800 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ పట్టుబడిన గంజాయి విలువ మార్కట్లో 1.80 కోట్లు ఉంటుందని అంచనా.
శంషాబాద్ ఎస్వోటీ, మియాపూర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో ఈ ముఠా దొరికిపోయింది. గంజాయి తరలిస్తున్న వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా గురించి మరిన్ని వివరాలను సీపీ స్టీఫెన్ రవీంద్ర మరికాసేపట్లో వెల్లడించనున్నారు.