నీళ్లు పట్టుకునే దగ్గర గొడవ పడి మహిళ గొంతు కోసి చంపేశాడో దుర్మార్గుడు. ఈ ఘటన ఢిల్లోలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో జరిగింది. దళిత్ ఏక్తా క్యాంప్ సమీపంలో శ్యామ్ కళ (48) అనే మహిళ తన కుటుంబంతో కలిసి నివశిస్తోంది. మంగళవారం ఉదయం 6 గంటలకు నీళ్లు పట్టేందుకు ఆమె పంపు దగ్గరకు వెళ్లింది. అదే ప్రాంతానికి చెందిన అర్జున్ అనే వ్యక్తి కూడా అప్పుడు నీళ్లు పట్టుకునేందుకు వచ్చాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
భార్యతో వేరే వ్యక్తి గొడవ పడటం చూసిన శ్యామ్ కళ భర్త కూడా అక్కడకు వెళ్లి అర్జున్తో గొడవ పడ్డాడు. దీంతో కోపం తెచ్చుకున్న అర్జున్.. అతన్ని చావబాదాడు. అక్కడితో ఆగకుండా ఇంటికెళ్లి కత్తి తీసుకొచ్చి శ్యామ్ కళ గొంతు కోసేశాడు. ఈ గొడవ విని బయటకు వచ్చి చూసే సరికి.. రక్తపు మడుగులో పడి ఉన్న తల్లి, కొంత దూరంలో స్పృహ కోల్పోయిన ఉన్న తండ్రి కనిపించారని ఆమె కుమారుడు చెప్పాడు. అర్జున్ అనే వ్యక్తి చాలా మంది స్థానికులతో గొడవలు పడ్డాడని, గతంలో క్రిమినల్ వ్యవహారాల్లో పాలు పంచుకునే వాడని తెలుస్తోంది.