హైదరాబాద్: జీడిమెట్ల గణేశ్ నగర్లో మెకానిక్గా పనిచేస్తున్న ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. జేఎస్పీ హోండా షోరూమ్ వద్ద అర్ధరాత్రి ఈ దారుణం జరిగింది. మెకానిక్ నోట్లో గుడ్డలు కుక్కి, రాడ్లతో కొట్టి చంపినట్లు తెలుస్తోంది.
మృతుడిని చింతల్లోని కల్పన సొసైటీకి చెందిన బీరేందర్ కుమార్గా పోలీసులు గుర్తించారు. జీడిమెట్లలోని గణేశ్ నగర్లో ఒక మెకానిక్ షాపులో బీరేందర్ పనిచేస్తున్నాడు. హత్య విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అక్కడ క్లూస్ టీంతో దర్యాప్తు ప్రారంభించారు.