సైదాబాద్, ఆగస్టు 27 : తల్లితో కలిసి భిక్షాటన చేస్తున్న బాలిక అదృశ్యమైన సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం హాఫీజ్బాబా నగర్కు చెందిన బాలిక (9) తన తల్లితో కలిసి ఇందిరాసేవా సదన్ చౌరస్తాలో భిక్షాటన చేస్తుండగా కన్పించకుండా పోయింది. కూతురు ఆచూకీ స్థానికంగా పలు ప్రాంతాల్లో గాలించినప్పటికీ కన్పించకపోవటంతో సైదాబాద్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.