దాహం వేస్తుండటంతో మంచినీరు తాగుదామనుకున్న బాలుడు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన ములుగు జిల్లాలో వెలుగు చూసింది. మంచినీరు అనుకొని సీసాలో ఉన్న పరుగుల మందు తాగేయడంతో సదరు పిల్లాడు మరణించినట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ములుగు జిల్లా తొగుబోరులో సురేశ్ (10) అనే బాలుడు ఇంటికెళ్లాడు.
అతనికి దాహం వేయడంతో మంచినీళ్లు తాగబోయి, పొరపాటున సీసాలో ఉన్న పురుగుల మందు తాగేశాడు. విషయం తెలియడంతో పిల్లవాడిని ఆస్పత్రికి తరలించేందుకు స్థానికులు ప్రయత్నించారు. అయితే ఆస్పత్రికి వెళ్లేసరికి బాలుడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.