హైదరాబాద్: భాగ్యనగరంలో బెట్టింగ్ ముఠా ఆటకట్టింది. బేగంబజార్ కేంద్రంగా ఆన్లైన్ బెట్టింగ్ కార్యకలాపాలు సాగిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాకు చెందిన మొత్తం 8 మంది సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి రూ.1.60 లక్షల నగదు, క్యాసినో కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.