మంచాల : పాతకక్షలతో ఓ వ్యక్తిపై గొడ్డలితో దాడి చేసిన సంఘటన మంచాల పోలీసు స్టేషన్ పరిధిలోని నోముల గ్రామంలో చోటుచేసుకుంది. శుక్రవారం సీఐ వెంకటేష్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని నోముల గ్రామానికి చెందిన వీరమల్ల వేణుగౌడ్, దండు రమేశ్గౌడ్లకు కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయని చెప్పారు. ఆదివారం రాత్రి వేణుగౌడ్ ఇంట్లో ఒక్కడే ఉన్న విషయం తెలుసుకున్న రమేశ్ అతని భార్య సునీత ఇద్దరు కలిసి వేణుపై గొడ్డలితో దాడి చేశారు. దీంతో వేణుగౌడ్కు తీవ్రగాయాలయ్యాయి. గ్రామస్తులు గమనించి వేణును చికిత్స నిమిత్తం ఇబ్రహీంపట్నంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.