ఆమనగల్లు : ఆమనగల్లు పట్టణానికి చెందిన వడ్యావత్ పవన్కళ్యాణ్ను బైక్ దొంగతనంలో కేసులో మంగళవారం రిమాండ్ చేసినట్లు ఎస్సై ధర్మేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన చాంద్పాషా ఈ నెల 4న శ్రీనివాసకాలనీలో తన నివాసం వద్ద బైక్ను పార్క్ చేయగా బైక్ చోరీకి గురైందన్నారు. బాధితుడు పాషా బైక్ చోరీ విషయంపై తమకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు చెప్పారు.
పట్టణంలో అనుమానస్పదంగా తిరుగుతున్న పవన్కళ్యాణ్ను అదుపులోకి తీసుకుని విచారించగా బైక్దొంగతనం కేసు వెలుగులోకి వచ్చిందన్నారు. బైక్ను స్వాధీనం చేసుకొని నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.