యాచారం : ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని చింతపట్ల గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. సీఐ లింగయ్య తెలిపిన కథనం ప్రకారం.. చింతపట్ల గ్రామానికి చెందిన వెంకటయ్య (45) అనే వ్యక్తి తన పక్కింటి వారు నూతనంగా నిర్మిస్తున్న ఇంటి వద్ద లైట్బంద్ చేయాలని ఇంటి యాజమాని కోరడంతో లైట్ బంద్ చేయడానికి వెళ్లాడు. అప్పటికే పిల్లర్ రాడ్కు విద్యుత్ వైర్ తేలి కరెంట్ సరఫరా అవుతుండటాన్ని గమనించక అతను ప్రమాదవశాత్తు దానిని పట్టకున్నాడు. దీంతో విద్యుత్ షాక్కు గురై ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.