మంచాల : భూ వివాదం పరిష్కారం కావడం లేదని ఓ వ్యక్తి మన స్థపానికి గురై ఇంట్లో ఉరేసుకోని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచాల పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రవి నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. అస్మత్పూర్ గ్రామానికి చెందిన ఇబ్రహీం (43) 20 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీ సిబ్బందిగా పని చేస్తున్నాడు. ఇతనికి నెల రోజుల నుంచి అన్నదమ్ముల మధ్య భూమికి సంబంధించిన పంపకాలపై గొడవలు జరుగుతున్నాయి.
భూమి పంపకాల విషయంలో తనకు న్యాయం జరగడం లేదంటూ మన స్థపానికి గురైన ఇబ్రహీం బుధవారం రాత్రి ఇంట్లోనే ఉరేసుకోని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.