షాద్నగర్ : ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన షాద్నగర్ పట్టణంలో చోటు చేసుకుంది. నాలుగు రోజుల క్రితం షాద్నగర్ పట్టణంలోని పటేల్ రోడ్డులో హత్యకు గురైన ఓ వ్యక్తి కేసును షాద్నగర్ పోలీసులు ఛేదించి వివరాలను వెళ్లడించారు. షాద్నగర్ సీఐ నవీన్కుమార్ కథనం ప్రకారం.. నిందితుడు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన నిరంజన్ బిస్సోయ్ డ్రైవర్గా ఉపాధి పొందుతు తన భార్యతో కలిసి పట్టణంలోని పటేల్రోడ్డులో నివాసం ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే నాగరాజు అనే వ్యక్తి నిందితుడు నిరంజన్ బిస్సోయ్ భార్యతో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నాడు.
విషయాన్ని గమనించిన నిరంజన్ బిస్సోయ్ ఈ నెల 2న తన నివాసంలో నాగరాజుపై సిమెంట్ ఇటుకలతో దాడిచేసి హత్య చేశాడు. హత్యకు పాల్పడిన నిరంజన్ బిస్సోయ్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని పోలీసులు తెలిపారు.