పరిగి టౌన్ : కుటుంబ కలహాలతో గొడవపడి అన్నను సొంత తమ్ముడు కొట్టి చంపిన ఘటన మండల పరిధిలోని గడిసింగాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. బుధవారం సీఐ లక్ష్మిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బుసి లక్ష్మయ్య తన బావ అయిన వెంకటయ్యతో గొడవపడ్డాడు. దీంతో బుసి లక్ష్మయ్య తమ్ముడు బుసి అనంతయ్య వచ్చి కర్రలతో అన్నపై దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. గ్రామ కారోబార్ మధు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.