మట్టెవాడ : వరంగల్ హంటర్ రోడ్లోని లక్ష్మిప్రసన్న ట్రాన్స్పోర్ట్ నుంచి చాక్లెట్, ఫెస్ట్ కాటన్స్ ఎత్తుకెళ్లిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు మట్టెవాడ ఇన్స్పెక్టర్ గణేష్ తెలిపారు. లారీ డ్రైవర్స్గా పనిచేస్తున్న లక్కాకుల రాజ్కుమార్, బోడసు సాయికృష్ణ, గుర్రం సాయికుమార్లు వివిధ రకాల సామాన్లలో నుంచి కొన్ని కాటన్స్ ఎత్తుకెళ్లి రాలేదని చెప్పుతున్నారని తెలిపారు. చోరికి గురైన చాక్లెట్స్, ఫెస్ట్ కాటన్స్ విలువ సుమారు రూ. 80వేలు వరకు ఉంటుందని తెలిపారు. ట్రాన్స్ఫోర్టు యజమాని కుంబం మధుకర్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.