మంచాల : రోడ్డు ప్రమాదంలో జాపాల కారోబార్ మృతి చెందాడు. ఎస్సై రవి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని జాపాల గ్రామానికి చెందిన నోములు జంగయ్య (38) గ్రామ పంచాయతీ పని నిమిత్తం మంచాలలో ఉన్న మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లాడు. పని ముగించుకోని అనంతరం తిరిగి మోటర్ సైకిల్పై జంగయ్య జాపాలకు వెళుతుండగా చాంద్ఖాన్గూడ నుంచి హైదరాబాద్కు వెళ్లుతున్న స్కూటీ ఎదురుగా వచ్చి మోటర్ సైకిల్ను ఢీకొట్టడంతో జంగయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.
పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ఆస్పత్రికి తరలించి అనంతరం బంధువులకు అప్పగించారు. శనివారం జాపాలలో జరిగిన అంత్యక్రియలల్లో టీఆర్ఎస్, సీపీఎం, కాంగ్రెస్ నాయకులు ఆయన భౌతికాయంపై పుష్పగుచ్ఛాన్ని ఉంచి నివాళులర్పించారు. జంగయ్యకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.