ఆమనగల్లు : మూఢ విశ్వాసాలను ఆసరాగా చేసుకొని భక్తి ప్రవచనాలను వల్లెవేస్తూ పూజల పేరిటా ప్రజలను మోసగించిన ముగ్గురు బురిడి బాబాలను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు మాడ్గుల సీఐ కృష్ణమోహన్ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యపేట జిల్లా పెన్నపహాడ్ మండలం అన్నారం గ్రామానికి చెందిన ముగ్గురు బురిడి బాబాలు పార్వతం స్వామి, పార్వతం సైదులు, సిరిసిల్ల బక్కయ్య, ఆలియాస్ బాలకృష్ణారెడ్డిలు సులువుగా డబ్బులు సంపాదించాలని ఆశతో జతకట్టారు. ఆయుర్వేద వైద్యం, జ్యోతిష్యం పేరుతో మాడ్గుల మండలంలోని కలకొండ, అందుగుల, అన్నెబోయిన్పల్లి, సమీప గ్రామాల్లో కొంతకాలంగా సర్వరోగ నివారిణి పేరిటా ప్రజలను వీరంతా గారడీ మాటలు చెప్పి మోసం చేశారు. సంతానం లేని వారికి పిల్లలు కల్గుతారని, మెండి రోగాలు బాధతప్పుతుందని, మంత్రించిన పసుపు, కుంకుమ చల్లితే జ్వరాలు మటుమాయం అవుతాయని పూనకాలతో ఊగుతూ ప్రజలను మోసగించారు.
ప్రజల మానసిక స్థితి, రోగాలను ఆసారాగా చేసుకొని వారి నుంచి బారిగా డబ్బుల వసుళ్లూకు పాల్పడ్డారు. ఇటివల బురిడి బాబాల వల్ల మోసపోయిన కొందరూ బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా బురిడి బాబాల బాగోతం వెలుగులోకి వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లో పూజల పేరిటా రూ. 20లక్షల వరకు వసూళ్లకు పాల్పడినట్లు విచారణలో తెలిపారు. బురిడిబాబాల నుంచి పూజ సామగ్రితో పాటు రూ. 13లక్షల నగదును రికవరీ చేసి వారిని రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. కేసు చేధనలో కీలకంగా వ్యహరించిన ఎస్సై, రమేశ్, కానిస్టేబుళ్లు బాలకృష్ణ, విజయ్లను సీఐ ప్రత్యేకంగా అభినందించారు.