వికారాబాద్ : చికిత్స పొందుతూ ఓ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవాబుపేట మండలం గేటువనంపల్లి గ్రామానికి చెందిన బేగరి ఎల్లమ్మ(69) భర్త జానయ్యతో ఇంటి వద్దే ఉంటుంది. కుమారులు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఈ నెల 8న కడుపు నొప్పి భరించలేక ఇంట్లో పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఉస్మానియ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. కుమారుడు సుకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశం తెలిపారు.