షాద్నగర్ : బంధువు దశదిన కర్మలో పాల్గొనేందుకు వచ్చిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువలో పడి మృతి చెందిన సంఘటన ఫరూఖ్నగర్ మండలం దేవునిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వసంత ఇటివలే కాలంలో మృతి చెందింది. ఇందులో భాగంగానే గురువారం సాయంత్రం దశదినకర్మలో భాగంగా ఇదే గ్రామానికి చెందిన బంధువైన ఎరుకల నర్సింహా తలనీలాలను తీసుకునేందుకు చెరువు వద్దకు వచ్చాడు. అక్కడ ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు.
చెరువులో పడిన వ్యక్తిని కాపాడేందుకు ప్రయత్నించిన ప్రాణాలను కాపాడలేకపోయమని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. దశదినకర్మ రోజే మరో కుటుంబ సభ్యుడు ఆకాల మృతి చెందడం తో గ్రామంలో విషాదం నెలకొంది. జరిగిన సంఘటనపై షాద్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.