శంకర్పల్లి : శంకర్పల్లి రైల్వేస్టేషన్లో ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు రైలు కిందపడి మృతి చెందారు. శుక్రవారం వికారాబాద్ జీఆర్పీ ఎస్ఐ వెంకట్రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం.. శంకర్పల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఇద్దరు వ్యక్తులు రైలు ఢీకొని మృతి చెందారని తెలిపారు. కాగా ఒకరు మహరాష్ట్ర నాగ్పూర్కు చెందిన స్వాత్నిన్ (32)గా ఆధార్కార్డు వివరాలతో గుర్తించామని, రెండో వ్యక్తి (55) సంవత్సరాల వృద్ధుడని ఇతను ఎవరు అన్నది ఆచూకీ తెలియలేదని తెలిపారు. వివరాల కోసం 9440627527కు ఫోన్ చేసి సంప్రదించాలన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.