నల్లగొండ : దామరచర్ల మండలం బొత్తలపాలెం వద్ద సోమవారం సాయంత్రం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. బైక్పై వెళ్తున్న అన్నాచెల్లెలిని ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న అన్నాచెల్లెలితో పాటు అల్లుడు మృతి చెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను నల్లగొండ జిల్లా వాడపల్లికి చెందిన ధనవత్ అంజి, ధనవత్ అంజలి, అల్లుడు రమావత్ నవదీప్(8) గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.