హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం పాలయ్యారు. సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకున్నది. దంపతులు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వారిపై నుంచి లారీ దూసుకెళ్లింది. దీంతో దంపతులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతులు కోదాడ వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు, సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.