పుణే : భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న ప్రబుద్ధుడు ఆమెను సుత్తితో కొట్టి చంపిన ఘటన పుణేలోని థెరాగావ్లో ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటన నెల కిందట జరగ్గా పరారీలో ఉన్న నిందితుడు బాలాసాహెబ్ జాదవ్ (51)ను పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు.
నిర్మాణ రంగంలో కూలీగా పనిచేసే బాలాసాహెబ్ భార్యపై అనుమానంతో తరచూ గొడవపడేవాడు. సెప్టెంబర్ 23న నిందితుడు భార్యపై సుత్తితో దాడి చేసి పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇక తీవ్రగాయాలతో బాధితురాలు సెప్టెంబర్ 29న మరణించింది. దీంతో నిందితుడిపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు బాలాసాహెబ్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయగా నర్హే ప్రాంతంలో అతడు పట్టుబడ్డాడు.