ముంబై : మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో శనివారం డీఆర్ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఓ ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ. 18 కోట్ల విలువైన కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు.
ఆ ఇద్దరిలో ఒకరిది కెన్యా కాగా, మరొకరిది గినియా. గినియా నుంచి మహిళ(30) బట్టల వ్యాపారం చేస్తున్నట్లు అధికారుల విచారణలో తేలింది. ఈ ఇద్దరూ ఇథియోపియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్లో అడిస్ అబాబా నుంచి ముంబైకి వచ్చినట్లు పేర్కొన్నారు. వారి వద్ద ఓ నాలుగు హ్యాండ్ బ్యాగులు లభించాయని, అవి ఖాళీగా ఉండటంతో అనుమానం వచ్చి కట్ చేశారు. దీంతో బ్యాగు పొరల్లో ఎనిమిది ప్లాస్టిక్ పౌచ్లు బయటపడ్డాయి. ఆ పౌచ్ల్లో 1.8 కేజీల కొకైన్ ను గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.