చేవెళ్ల రూరల్ : చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు రంజిత్రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. బుధవారం ఆయన చేవెళ్లకు వెళ్తుండగా మల్కాపూర్ స్టేజ్ వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. బోల్తా పడిన ఆటోను గమనించిన ఎంపీ తన వాహనాన్ని ఆపి గాయపడిన వారిని 108లో ఎక్కించారు. ఎక్కించడమే కాకుండా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అక్కడే ఉన్న పోలీసులు సూచించి, ఫోన్ ద్వారా వైద్యులను ఆదేశించారు. అనంతరం ఆయన చేవెళ్లకు తిరుగు ప్రయాణమయ్యారు.