కుత్బుల్లాపూర్,ఆగస్టు: ఓల్ఎక్స్లో బైక్ కొనుగోలుపై వచ్చిన ప్రకటన చూసి ఓ యువకుడు తన నగదును ఆన్లైన్ ద్వారా పంపడంతో మోసపోయిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…మైసమ్మగూడ ప్రాంతానికి చెందిన తోటమురళీ(19) ఇటివల ఓల్ఎక్స్లో బైక్ను కొనుగోలు చేసేందుకు అందులో ఉన్న నంబర్ను కాంటాక్ట్ చేశాడు.
అన్నీ ప్రాసెసింగ్ ఫీజుల పేరిట రూ.32,498 పంపిన తర్వాత మోసపోయానని గమనించి స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.