కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. 24 గంటల వ్యవధిలో జిల్లా పరిధిలో రెండు చోట్ల చైన్ స్నాచింగ్కు పాల్పడ్డారు. జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం లక్ష్మి అనే ఎఎన్ఎం మెడలో నుంచి 2 తులాల బంగారు గొలుసును చైన్ స్నాచర్లు దొంగిలించారు. బైక్ పై నుంచి వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడల నుంచి మంగళ సూత్రం గొలుసును దొంగిలించి పారిపోయారు. చైన్ స్నాచింగ్ ఘటనపై కామారెడ్డి పట్టణ పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
కాగా మంగళవారం సాయంత్రం సదాశివనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇస్లాంపూర్కు చెందిన చెట్కూరి యమున కుప్రియాల్ గ్రామంలో గల జ్యోతిరావుఫూలే బాలికల పాఠశాలలో టీచర్గా పనిచేస్తుంది. సాయంత్రం పాఠశాల నుంచి తిరిగి వస్తున్న సమయంలో కుప్రియాల్ సమీపంలో మెడలో నుంచి చైన్ లాక్కోని పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యా ప్తుచేస్తున్నారు. ఈ రెండు ఘటనలపై డీఎస్పీ సోమనాథం స్పందించారు. ప్రత్యేక పోలీస్ బృందాలతో గాలింపు చర్యలు చేపడుతున్నామని , త్వరలోనే నిందితులను గుర్తించి పట్టుకుంటామని ఆయన వెల్లడించారు.