రంగారెడ్డి : సిమెంట్ లారీ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందిన సంఘటన జిల్లాలోని బొంరాస్పేట పోలీసు స్టేషన్ పరిధి నాగిరెడ్డిపల్లి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై సోమవారం చోటు చేసుకుంది. పీఎస్ఐ ప్రియాంకరెడ్డి కథనం ప్రకారం.. కర్నాటక రాష్ట్రం సేడెం నుంచి హైదరాబాద్కు సిమెంట్ లోడుతో వెళ్తున్నది.
డ్రైవర్ ఆనంద్ పూజారి నిద్రమత్తులో లారీని నిర్లక్ష్యంగా నడపడంతో నాగిరెడ్డిపల్లి సమీపంలో బోల్తా పడింది. క్యాబిన్ కింద ఇరుకొనని డ్రైవర్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. డ్రైవర్ స్వస్థలం కర్నాటకలోని సేడం తాలుకా లింగంపల్లి గ్రామం. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పీఎస్ఐ ప్రియాంకరెడ్డి తెలిపారు.