Road Accident | ఒడిశా (Odisha)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది (Road Accident). సింగిల్ లేన్ రోడ్డులో అతివేగంగా వెళ్తున్న ఓ ఎస్యూవీ కారు (SUV Car) ఎదురుగా వస్తున్న ఆటో, రెండు ద్విచక్ర వాహనాలను బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పది మందికిపైనే గాయపడ్డారు. కోరాపుట్ జిల్లాలో (Koraput district) శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
అతి వేగంగా వస్తున్న ఎస్యూవీ కారు.. ముందు వెళ్తున్న ఆటోను ఓవర్ టెక్ చేసేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న బైక్ను ఢీ కొట్టింది. అనంతరం ముందు వెళ్తున్న ఆటోను, మరో బైక్ను, ట్రాక్టర్ను సైతం ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో ఆటోలో సుమారు 15 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం.
ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా మొత్తం ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే స్పందించిన సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
🚨🇮🇳India :—Seven people were killed in an accident in india state ,Odisha’s Borigumma earlier today.#India #accident #CCTV #Odisha #Borigumma pic.twitter.com/yrh3ljaFH9
— EUROPE CENTRAL (@europecentrral) January 26, 2024
Also Read..
Suhaib Yaseen | బౌలింగ్ చేస్తుండగా గుండెపోటు.. కశ్మీర్ యువ పేసర్ మృతి